పాలమూరు జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలు: మంత్రి హరీశ్ రావు

ABN , First Publish Date - 2022-01-18T21:10:58+05:30 IST

ఉమ్మడి పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు మెడికల్ కాలేజీలను మంజూరు చేశారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

పాలమూరు జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలు: మంత్రి హరీశ్ రావు

మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు మెడికల్ కాలేజీలను  మంజూరు చేశారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మూడు మెడికల్ కాలేజీలకు 1500 కోట్లు మంజూరు చేశారని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 30పడకల ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఉపయోగ పడుతుందని ఈ ఆస్పత్రిని ప్రారంభించినట్టు తెలిపారు.


గత పాలకులు మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ అయినా మంజూరు చేయలేదని మంత్రి ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇస్తే ఇందులో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పురోగతికి పాటుపడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం శ్రమిస్తున్నారని అన్నారు. 

Updated Date - 2022-01-18T21:10:58+05:30 IST