త్వరలో మెదక్ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుంది:Harish rao

ABN , First Publish Date - 2022-05-27T20:37:44+05:30 IST

త్వరలో మెదక్ రైల్వే లైన్(railway line) అందుబాటులోకి వస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు (harish rao)వెల్లడించారు.

త్వరలో మెదక్ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుంది:Harish rao

మెదక్: త్వరలో మెదక్ రైల్వే లైన్(railway line) అందుబాటులోకి వస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు (harish rao)వెల్లడించారు. శుక్రవారం మెదక్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.ఈసందర్భంగా  ఆయన మాట్లాడుతూ మెదక్లో మాతా శిశు ఆరోగ్య కేంద్రం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. త్వరలో వైద్య కళాశాలకు సంబంధించి ఉత్తర్వులు అందజేస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. వైద్య రంగానికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తుందని అన్నారు.


తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానాలను కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించే విధంగా తీర్చిదిద్దతున్నట్టు తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వుండే సౌకర్యాలన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిసౌకర్యాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇక మెదక్ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగి పోతాయన్నారు. 

Updated Date - 2022-05-27T20:37:44+05:30 IST