రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటిమయం అవుతుందన్నారు: హరీశ్ రావు
ABN , First Publish Date - 2022-04-13T20:59:26+05:30 IST
తెలంగాణ రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటి అవుతుందని ఉమ్మడిరాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటి అవుతుందని ఉమ్మడిరాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. కానీ ఇప్పుడు ఏపీ చీకటైందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 24 గంటల కరెంట్ వస్తోందని మంత్రి గుర్తు చేశారు.తెలంగాణలో పామాయిల్ సాగుకు ఎకరానికి రూ.80 వేల సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి హరీష్రావు తెలిపారు.పామాయిల్ సాగుతో ఏటా ఎకరానికి రూ.లక్షా 50 వేల ఆదాయం రైతులకు వస్తోందన్నారు. మనదేశంలో నూనె వినియోగం ఎక్కువ.. ఉత్పత్రి తక్కువగా ఉందని, బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం అంటోందని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ అనేది ఓ చరిత్ర.. ఇక దానికి భవిష్యత్ లేదని మంత్రి స్పష్టం చేశారు.