దుర్గమ్మ దర్శనం ఎంతో ఆనందదాయకం: మంత్రి జయరాం
ABN , First Publish Date - 2021-10-08T15:11:36+05:30 IST
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు బాలాత్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం దర్శించారు.
విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు బాలాత్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం దర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాలాత్రిపురసుందరి దేవిగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. రాష్ట్రంలోని అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నారు. కరోనా నుంచి దూరమై అందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్మికులకు అన్ని సదుపాయాలు తమ ప్రభుత్వం అందిస్తోందని మంత్రి జయరాం తెలిపారు.