హరీష్‌రావుపై మంత్రి గుడివాడ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-09-30T22:10:36+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Government of Andhra Pradesh) అక్కడి ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని తెలంగాణ

హరీష్‌రావుపై మంత్రి గుడివాడ సంచలన వ్యాఖ్యలు

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Government of Andhra Pradesh) అక్కడి ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి హరీష్‌రావు (Harish Rao) విమర్శించారు. ఇప్పుడు హరీష్ వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హరీష్‌రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీచర్లకు తాము ఏమి చేశామో...ఏపీకి వచ్చి చూడాలన్నారు. గతంలో ఢిల్లీలోని ఏపీభవన్‌ (AP Bhavan)లో ఏపీ ఉన్నతాధికారిని హరీష్‌రావు బూట్ కాలితో ఎలా తన్నారో అందరూ చూశారని గుర్తుచేశారు. హరీష్‌రావుకు సీఎం కేసీఆర్‌ (CM KCR)కు గొడవలు ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలని, ఆంధ్రప్రదేశ్‌పై ఎందుకు పడుతున్నారని ప్రశ్నించారు. హరీష్‌రావు...కేసీఆర్ మనిషా? రామోజీరావు మనిషా? అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్‌ను హరీష్‌రావును చూసి తాము నేర్చుకోవాలిసిన అవసరం లేదని తోచిపుచ్చారు. ఏపీలో మూడేళ్లలో తాము ఏం చేశామో ప్రజలకు తెలుసని అమర్నాద్ చెప్పారు. 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని, కేసులు నమోదు చేసి లోపలికి పంపిస్తోందని హరీష్‌రావు విమర్శించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులతో స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. గురువారం సిద్దిపేటలో ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో ఐదేళ్లలో 73 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని ఆయన పేర్కొన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమానికి రూ.7,300 కోట్లు బడ్జెట్‌లో ప్రవేశపెట్టామన్నారు. ఉపాధ్యాయులకు కొన్ని సమస్యలు ఉన్నాయని, సాధ్యమైనంత వరకు సమస్యలు పరిష్కరిస్తామని హరీష్‌రావు తెలిపారు.

Updated Date - 2022-09-30T22:10:36+05:30 IST