హెచ్సీఎల్ను సందర్శించిన మంత్రి మేకపాటి
ABN , First Publish Date - 2020-06-04T08:37:27+05:30 IST
ష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కేసరపల్లిలోని హెచ్సీ ఎల్ను బుధవారం సందర్శిం చారు.
విజయవాడ సిటీ, జూన్ 3 : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కేసరపల్లిలోని హెచ్సీ ఎల్ను బుధవారం సందర్శిం చారు. మంత్రికి హెచ్సీఎల్ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. హెచ్సీఎల్ విజయవాడ హెడ్ ప్రతినిధులతో ఆయనతో కొద్దిసేపు భేటీ ఆయ్యారు. అనంతరం బ్యాటరీ వాహనంలో హెచ్సీఎల్ క్యాంపస్ను పరిశీలించారు. క్యాంపస్లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, హెచ్సీఎల్ సాఫ్ట్వేర్ ల్యాబ్ను, మొదటి టవర్లోని బోర్డురూమ్, గోల్ఫ్ కోర్టును ఆయన సందర్శించారు.