ఏపీ ఫైబర్ నెట్ మరింత బలోపేతం: మంత్రి గౌతమ్
ABN , First Publish Date - 2021-01-21T16:07:22+05:30 IST
ఏపీ ఫైబర్ నెట్ మరింత బలోపేతం చేస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు.
విశాఖపట్నం: ఏపీ ఫైబర్ నెట్ మరింత బలోపేతం చేస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం మంత్రి అవంతి శ్రీనివాస్ నివాసంలో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డితో పాటుగా వివిధ పారిశ్రామిక వర్గాలతో జిల్లాలో ఉన్న సమస్యలపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్రెడ్డి మాట్లాడుతూఫిబ్రవరిలో పరిశ్రమల శాఖ, టూరిజం శాఖ సంయుక్తంగా ఒక మీటింగ్ విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం తీసుకు వస్తామని... అందుకు సుమారు ఐదు వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఐటీ రంగానికి ఏపీలో మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. మెడిటెక్ జోన్, ప్రపంచంలోనే అత్యుత్తమమైన వ్యవస్థ అని, దీనివల్ల ఇప్పుడు అనేక ఉత్పత్తులు మనకు తక్కువ ధరకు లభించాయని మంత్రి గౌతమ్రెడ్డి పేర్కొన్నారు.