Minister: ఆ పథకం మాదే...!
ABN , First Publish Date - 2022-10-01T16:41:30+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం పథకం అమలుచేసిన ఘనత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కే దక్కుతుందని సాంఘిక సంక్షేమ
- మంత్రి గీతాజీవన్
పెరంబూర్(చెన్నై), సెప్టెంబరు 30: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం పథకం అమలుచేసిన ఘనత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కే దక్కుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గీతాజీవన్(Minister Geethajeevan) తెలిపారు. నగరంలో శుక్రవారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, అన్నాడీఎంకే హయాంలోనే అక్షయ పాత్ర పేరుతో అల్పాహారం పథకం ప్రారంభమైందని ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి చెబుతున్నారని, ఓ స్వచ్ఛంధ సంస్థ చేపట్టిన పథకాన్ని తమదిగా ఈపీఎస్ ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు.