కిషన్‌రెడ్డి తెలంగాణపై విషం చిమ్మిండు: మంత్రి Gangula

ABN , First Publish Date - 2022-04-21T18:23:08+05:30 IST

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణపై విషయం చిమ్మారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

కిషన్‌రెడ్డి తెలంగాణపై విషం చిమ్మిండు: మంత్రి Gangula

కరీంనగర్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణపై విషయం చిమ్మారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.... తెలంగాణ ప్రజలని దొంగల్లాగా చూస్తున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి..నామినేటెడ్‌గా ఎన్నిక కాలేదని... తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచారని గుర్తు చేశారు. బియ్యం మాయం అయ్యాయని అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బియ్యానికి తమరు డబ్బులు ఇచ్చారా.. నలబై కోట్ల 50 లక్షల ధాన్యం బస్తాలు అన్నీ లెక్కించారా అని ప్రశ్నించారు. బియ్యం ఎక్కడికీ వెళ్ళలేదని తెలిపారు. తమరు లెక్కించింది బియ్యమా, ధాన్యమా అని నిలదీశారు. ఎఫ్‌సీఐ తనిఖీలు ఎక్కడ చేసినా సహకరిస్తామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-04-21T18:23:08+05:30 IST