బీసీలంటే బీజేపీకి ఎందుకంత కోపం: మంత్రి Gangula

ABN , First Publish Date - 2022-07-04T19:59:12+05:30 IST

బీసీ రిజర్వేషన్లు, మంత్రిత్వ శాఖపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు ప్రకటన చేయలేదని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.

బీసీలంటే బీజేపీకి ఎందుకంత కోపం: మంత్రి Gangula

కరీంనగర్: బీసీ రిజర్వేషన్లు, మంత్రిత్వశాఖపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) ఎందుకు ప్రకటన చేయలేదని మంత్రి గంగుల కమలాకర్ (Gangula kamalakar) ప్రశ్నించారు. నిన్న హైదరాబాద్‌లో మోదీ ప్రసంగంపై మంత్రి మాట్లాడుతూ... బీసీలంటే బీజేపీకి ఎందుకంత కోపమని అన్నారు. 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. వానాకాలం పంట కొంటారా కొనరో చెప్పడం లేదని మండిపడ్డారు. చికెన్, మటన్ బిర్యానీలు వడ్డించడం తప్ప కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతుల గురించి మాట్లాడరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌కు ఏం తెచ్చారో బండి సంజయ్ చెప్పాలని మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-04T19:59:12+05:30 IST