తెలంగాణ బియ్యం తీసుకునే ఉద్దేశ్యం కేంద్రానికి లేదు: మంత్రి గంగుల

ABN , First Publish Date - 2021-12-25T00:14:34+05:30 IST

తెలంగాణ బియ్యం తీసుకునే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు

తెలంగాణ బియ్యం తీసుకునే ఉద్దేశ్యం కేంద్రానికి లేదు: మంత్రి గంగుల

ఢిల్లీ: తెలంగాణ బియ్యం తీసుకునే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..బియ్యంపై కేంద్రం స్పష్టత  కోసం 7 రోజులుగా ఎదురుచూశామన్నారు.రాష్ట్రంలోఇప్పటి వరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.వచ్చే ఏడాది నుంచి ఏసంగి వడ్లు కొనమని చెప్పారు. ధాన్యంపై ఏడాది ముందు నుంచే కేంద్రానికి లేఖ రాశామని, ఇప్పటి వరకు ఆరుసార్లు కేంద్రానికి లేఖ రాశామని చెప్పారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం విఫలం అయ్యింది, కేంద్రానికి ముందు చూపు లేదని మండిపడ్డారు.21లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గోదాముల్లో నిల్వలు ఉన్నాయన్నారు.రాష్ట్ర రాసిన లేఖలకు కేంద్రం నుంచి ఎందుకు రిప్లయ్ రాలేదో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-25T00:14:34+05:30 IST