Telangana: మున్నూరు కాపులకు CM KCR సముచిత స్థానం ఇచ్చారు: మంత్రి గంగుల

ABN , First Publish Date - 2022-05-19T22:42:39+05:30 IST

తెలంగాణ రాకముందు మున్నూరు కాపులను రాజకీయంగా వాడుకున్నారని, బీసీల్లో అధిక శాతం ఉన్న మున్నూరు కాపులకు CM కేసీఆర్ పదవులు ఇచ్చి గౌరవించడం అభినందనీయమని మంత్రి గంగుల

Telangana: మున్నూరు కాపులకు CM KCR సముచిత స్థానం ఇచ్చారు: మంత్రి గంగుల

Hyderabad: తెలంగాణ రాకముందు మున్నూరు కాపులను రాజకీయంగా వాడుకున్నారని, బీసీల్లో అధిక శాతం ఉన్న మున్నూరు కాపులకు CM కేసీఆర్ పదవులు ఇచ్చి గౌరవించడం అభినందనీయమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థి‌గా వద్దిరాజు రవిచంద్రకు అవకాశం ఇచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. కుల సంఘం సమావేశం పెట్టడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారని, అయితే తన కులాన్ని ముందు తాను గౌరవిస్తానని చెప్పారు. అన్నీ పార్టీలు గుర్తించాలంటే కుల సంఘాలు పటిష్టంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో బీసీలకు నాలుగు మంత్రిత్వ శాఖలు కేటాయించారని, హైదరాబాద్ మహానగరంలో మున్నూరు కాపులకు రెండు సార్లు మేయర్ పదవీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే కోకాపేటలో కోట్ల విలువైన స్థలం మూన్నురు కాపు భవనానికి ఇచ్చారని, మున్నూరు కాపులు ఎల్లప్పుడూ కేసీఆర్ వెన్నంటే ఉంటారని పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-19T22:42:39+05:30 IST