బీజేపీ నాయకులు యువతను రెచ్చగొట్టొద్దు: మంత్రి gangula
ABN , First Publish Date - 2022-06-20T23:15:40+05:30 IST
సున్నితమైన అంశాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని బిజెపి నాయకులకు బిసి. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) సూచించారు.
కరీంనగర్: సున్నితమైన అంశాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని బిజెపి నాయకులకు బిసి. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) సూచించారు. గతంలో మాదిరిగానే ఆర్మీలో నియామకాలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సికింద్రాబాద్(secundera bad incident) ఘటన నేపధ్యంలో ఆయన ప్రకటన చేస్తూ సికింద్రాబాద్ ఘటనలో టీఆర్ఎస్ పాత్ర వుందని చెబుతున్నఆపార్టీ నాయకులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా టీఆర్ఎస్ వాళ్లే చేపించారా? అని ప్రశ్నించారు.సున్నితమైన అంశాలపై ఆచితూచి మాట్లాడి సమస్యను పరిష్కారం చేయాలి తప్ప వివాదం చేయొద్దని, మూర్ఖపూ మాటలు మాట్లాడొద్దని అన్నారు.
నాలుగేళ్లు మాత్రమే ఉద్యోగంలో ఉంటే దేశ సేవ ఎలా చేస్తారని.గతంలో లాగే నియామకాలు చేపట్టాలని అన్నారు.రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పూర్తయిందని, ఇప్పటి వరకు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు.ఇప్పటి వరకు 9715 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేశామని, అందులో 7464 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగిందని అన్నారు.మిగిలిన ధాన్యం రైస్ మిల్లుల వద్ద ఆన్లైన్ నమోదు పూర్తయ్యాక చెల్లింపు పూర్తి చేస్తామని అన్నారు.