దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు: Gangula kamalakar

ABN , First Publish Date - 2022-06-13T20:33:53+05:30 IST

బీజేపీకి ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమేనని, దేశ ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని బిసి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు.

దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు: Gangula kamalakar

కరీంనగర్: బీజేపీకి ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమేనని, దేశ ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని బిసి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు.కేసీఆర్ ప్రకటన తో దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది.తాను ఎల్లప్పుడూ కేసీఆర్ వెంటే ఉంటానని అన్నారు.పట్టణ ప్రగతి(pattana pragati) కార్యక్రమంలో భాగంగా స్థానిక రాంనగర్లో 35 లక్షలతో మార్కెట్ ఆధునీకరణ పనులకు మంత్రి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు.పల్లెలన్ని పట్టణాలుగా మారాలని...పల్లెలు, పట్టణాల్లా మెరవాలన్నారు. గతంలో మహిళలు, ప్రయాణాల్లో నగరంలో టాయిలెట్స్ కోసం బయటికెళ్లాలంటే ఇబ్బందులు పడే వాళ్ళు.ఆ సమస్యలను అధిగమించాలని నగరం పరిశుభ్రంగా ఉండాలని.23 టాయిలెట్స్ పట్టణ ప్రగతిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.


కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.అందులో వారికి కావాల్సిన అన్ని సమకూరుస్తాం.టాయిలెట్ల ఏర్పాటు పై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.నగరంలో మార్కెట్లు లేక రోడ్లపై అమ్మేవారికోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేసామని మంత్రి తెలిపారు. ప్రజలు 80 ఏళ్ళు పాలించిన వారి పాలనను ప్రజలు చూసారు.8 ఏళ్లలో మా పాలన చూసారు. తెలంగాణలో జరిగినఅభివృద్ధి తమ వద్ద కావాలని కోరుకుంటున్నారు. 


ఎన్టీఆర్ పార్టీ  ప్రారంభించిన్నపుడు 13 నెలల్లో ఆయనను చూసి అధికారం ఇచ్చారు.ఇప్పుడు అదే ప్రజలు కేసీఆర్ పాలన ను చూస్తున్నారు..కావాలని కోరుకుంటున్నారు.గుజరాత్ లో మహిళలు నీటికి , రైతులు సాగునీటి కి ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై చర్చ జరుగుతోంది.ప్రజలు ఏది అయితే కోరుకుంటారో  కేసీఆర్ అదే చేస్తాడు...దేశంలో బీజేపీ కి ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు.


Updated Date - 2022-06-13T20:33:53+05:30 IST