పర్యాటక కేంద్రంగా కరీంనగర్: Gangula kamalakar
ABN , First Publish Date - 2022-06-07T01:33:21+05:30 IST
తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్(kcr) ఆలోచనల మేరకు దిగువ మానేరు జలాశయాన్నిసర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని బిసి, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ (gangula kamalakar) తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్(kcr) ఆలోచనల మేరకు దిగువ మానేరు జలాశయాన్నిసర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని బిసి, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ (gangula kamalakar) తెలిపారు. రానున్న రోజుల్లో కరీంనగర్(karim nagar) గొప్ప పర్యాటక ప్రాంతంగా ఉండబోతుందని అన్నారు. గుజరాత్ లోని ఆహ్మాదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ కు ధీటుగా ఉంటుందని 410 కోట్లతో నీటిపారుదల, పర్యాటక శాఖలను సమన్వయంతో పనులు చురుకుగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.సోమవారం మానేరు రివర్ ఫ్రంట్ ,కేబుల్ బ్రిడ్జ్ పనులను మంత్రి గంగుల కమలాకర్ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు బోయిని పల్లి వినోద్ కుమార్ తో కలిసి పరిశీలించారు.
పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ మొదటి దశలో ప్రస్తుతం ఎల్ఎండీ గేట్ల నుంచి 3.7 కిలోమీటర్ల మేరకు 200 మీటర్ల వెడల్పుతో దిగువనకు ఉన్న నీటి ప్రవా హానికి ఇరువైపుల16 అడుగుల ఎత్తు వరకు భారీ ప్రహరీలను నీటి అడుగు నుంచి నిర్మించబోతున్నామని తెలిపారు.రిజర్వాయర్ పరిసరాల్లో పాదచారులు నడిచేందుకు.. పర్యాటకులు కూర్చుని వీక్షించేందుకు బెంచీలను ఏర్పాటు చేస్తామని అన్నారు.