ధాన్యం కొనుగోళ్లపై శ్వేత పత్రం విడుదల చేసిన మంత్రి Gangula kamalakar

ABN , First Publish Date - 2022-05-04T20:15:47+05:30 IST

ధాన్యం కొనుగోల్లపై ఆరోపణలు నిరాధారమని దానిపై బుధవారం శ్వేత పత్రం విడుదల చేసినట్టు రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లపై శ్వేత పత్రం విడుదల చేసిన మంత్రి  Gangula kamalakar

హైదరాబాద్: ధాన్యం కొనుగోల్లపై ఆరోపణలు నిరాధారమని దానిపై  బుధవారం శ్వేత పత్రం విడుదల చేసినట్టు రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి Gangula kamalakar తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరి పండక పోవడం, ధాన్యం పండించే రాష్ట్రాలైన తెలంగాణ, పంజాబ్, ఓడిషా, చత్తీస్ఘడ్, ఆంద్రప్రదేశ్ వంటి చోట్ల బీజేపీ అధికారంలో లేకపోవడం వల్లనే ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు స్రుష్టిస్తున్నదని ఆరోపించారు. కేంద్రం సహకరించకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ నిధుల్ని సమకూర్చారని, రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారని తెలిపారు, అదే రీతిలో అత్యంత అవసరమైన గన్నీ బ్యాగులను సైతం కేంద్రం ఇంతవరకూ ఒక్క బ్యాగు ఇవ్వకున్నా స్వతహాగా రైస్ మిల్లర్ల వద్దనుండి, సప్లైయర్స్ వద్దనుండి యుద్దప్రతిపాధికన సేకరించి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. రైతులకు చిన్న ఇబ్బంది లేకుండా కొనుగోళ్ల ప్రక్రియను కొనసాగిస్తున్నామన్నారు.


కానీ కేంద్రం మాత్రం దీనికి పూర్తి విరుద్దంగా రైతులపై కక్ష్య సాధింపు చర్యలు చేపట్టడం శోచనీయమన్నారు. యాసంగిలో రా రైస్ రాదని తెలిసినా అదే ఇవ్వాలని మంకు పట్టు పట్టడం, నేడు కొనుగోళ్లు ఊపందుకునే దశలో దాన్ని అడ్డుకునే విదంగా ఎఫ్.సి.ఐ అధికారులను ఉసిగొల్పి రైస్ మిల్లులపై వెరిఫికేషన్ పేరుతో దాడులు చేస్తూ, ధాన్యం దించకుండా అడ్డుకోవడం వంటి చర్యలతో తెలంగాణ రైతులపై కేంద్రం కక్ష్య సాధింపు చర్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. దీనిపై తెలంగాణ ఓట్లతో గెలిచిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించి రైతుల పక్షాన డిమాండ్ చేయాలన్నారు.  కరీంనగర్ నియోజకవర్గంలో ని కొత్తపల్లి మండలం ఎలగందల్ ,చింతకుంట కరీంనగర్ రురల్ మండలం దుర్షేడ్, ముగ్ధుమ్ పూర్ ,చెర్లభుత్కూర్ ,చామన్ పల్లి నగునూర్ గ్రామాల్లో  లో డీసీఎంఎస్,ఐకేపీ,పీఏసీఎస్ ల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై శ్వేత పత్రాన్ని విడుదల చేసినట్టు తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకూ జరిపిన కోనుగోళ్ల వివరాలు, గన్నీబ్యాగుల అందుబాటు వంటి వివరాల్ని వెల్లడించారు, కొనుగోళ్ల మొదలు పెట్టిన రోజే బహిరంగంగా ఎన్ని గన్నీ బ్యాగులున్నాయన్నామో చెప్పామన్న మంత్రి నేడు కేంద్రం నుండి ఒక్క బ్యాగు రాకున్నా 7కోట్ల 77 లక్షల గన్నీలను రికార్డు స్థాయిలో సేకరించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3525 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, 4,21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 55553 మంది రైతుల దగ్గరినుండి సేకరించామన్నారు, ఈ ధాన్యం విలువ 821 కోట్లు అన్నారు. ఈ డబ్బుల్ని రైతులకు సకాలంలో అందజేయాలంటే మిల్లర్లు గుర్తించాల్సి ఉంటుందని, ఎఫ్.సి.ఐ అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ పేరుతో మిల్లర్లు ధాన్యం దించకుండా అడ్డుకుంటున్నారని తద్వారా రైతులకు సకాలంలో ధాన్యం సేకరణ, డబ్బుల విడుదల చేయకుండా కుట్ర పన్నారన్నారు.

Read more