క్రీడలను ప్రోత్సహిస్తున్న మంత్రి కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-02-28T06:31:24+05:30 IST

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామా రావు క్రీడలను, క్రీడాకారలను ప్రోత్సహిస్తన్నారని కో ఆపరేటివ్‌ బ్యాంకుల జా తీయ అధ్యక్షుడు కొండూరు రవీందర్‌రావు అన్నారు.

క్రీడలను ప్రోత్సహిస్తున్న మంత్రి కేటీఆర్‌
పోటీలను ప్రారంభిస్తున్న రవీందర్‌రావు

- కో ఆపరేటివ్‌  బ్యాంకుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు కొండూరు రవీందర్‌రావు

సిరిసిల్ల టౌన్‌, ఫిబ్రవరి 27: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామా రావు క్రీడలను, క్రీడాకారలను ప్రోత్సహిస్తన్నారని కో ఆపరేటివ్‌ బ్యాంకుల జా తీయ అధ్యక్షుడు కొండూరు రవీందర్‌రావు అన్నారు. శనివారం సిరిసిల్ల పట్ట ణం ప్రభుత్వ బాలురు జూనియర్‌ కళాశాల క్రీడా మైదా నంలో వీబీఏ సిరిసిల్ల ఆధ్వర్యంలో సిరిసిల్ల వాలీబాల్‌ పోష కులు, క్రీడాకారుల స్మారక ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా స్థాయి (పురుషుల) వాలీబాల్‌ టోర్నమెంట్‌ను రవీందర్‌రావు, పుర పాలక సంఘం చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణీలు ప్రారం భించారు.  32 జట్లు పోటీలలో పాల్గొంటున్నాయి. జిల్లా గ్రంథాలయం చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, రైతు సమ న్వయసమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T06:31:24+05:30 IST