వైద్య రంగంలో దూసుకుపోవడం ఖాయం: ఈటల
ABN , First Publish Date - 2020-07-14T00:20:48+05:30 IST
రాబోయే కాలంలో వైద్య రంగంలో తెలంగాణ దూసుకుపోవడం ఖాయం అని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్
మహబూబ్నగర్: రాబోయే కాలంలో వైద్య రంగంలో తెలంగాణ దూసుకుపోవడం ఖాయం అని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనాన్ని మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన జిల్లా మహబూబ్నగర్ అని పేర్కొన్నారు. ఈ జిల్లా కరువు పరిస్థితులకు ఎదురొడ్డి.. ప్రజానికానికి అన్నం పెట్టే జిల్లాగా ఎదిగిందని అన్నారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ వచ్చిందని మంత్రి చెప్పుకొచ్చారు. ఆనాడు ‘‘పల్లే పల్లెనా పల్లెర్లు మొలిచే’’ అని పాడిన జిల్లా పాలమూరు జిల్లాను ఉద్దేశించే అని గత పరిస్థితిని ఈటల గుర్తుచేశారు. సమైక్య రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా పెట్టలేదన్నారు. ఇప్పుడు ఐదు మెడికల్ కాలేజీలు పెట్టుకున్నామని వెల్లడించారు.