గిరి జనంతో మమేకమై...మంత్రి ఎర్రబెల్లి హోలీ కోలాటం

ABN , First Publish Date - 2022-03-17T21:31:46+05:30 IST

జనంతో ఇట్లే కలిసిపోయి, వాళ్ళతో పాటు ఆటా, పాట, జీవితాల్లో ఒకడిగా నిలిచే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి తను మాస్ కు మాస్ లీడర్ నని నిరూపించారు.

గిరి జనంతో మమేకమై...మంత్రి ఎర్రబెల్లి హోలీ కోలాటం

జనగామ జిల్లా: జనంతో ఇట్లే కలిసిపోయి, వాళ్ళతో పాటు ఆటా, పాట, జీవితాల్లో ఒకడిగా నిలిచే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి తను మాస్ కు మాస్ లీడర్ నని నిరూపించారు. తనకు ఎదురైన గిరిజన మహిళలతో వారి కోరిక మేరకు కోలాటం ఆడి ఆనంద పరిచారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో కడవెండి-పొట్టిగుట్ట శివారులోని వానకొండయ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తూండగా.. మార్గం మధ్యలో లంబాడా గిరిజన మహిళలు హోలీ ఆడుతూ కనిపించారు.


వారిని చూసిన మంత్రి తన వాహనాన్ని ఆపి, వారిని పలకరించారు. మంత్రి తో కలిసిపోయిన లంబాడ గిరిజన మహిళలు ఆయనకు బొట్లు పెడుతూ తమతోపాటు హోలీ అలాగే కోలాటం ఆడాల్సింది గా విజ్ఞప్తి చేశారు. వారి కోరికను మన్నించిన మంత్రి వారితో కొద్దిసేపు చప్పట్లు కొడుతూ, మరి కొద్దిసేపు కోలాటం ఆడి, అక్కడున్న వాళ్ళందరిని ఆనందపరిచారు.

Updated Date - 2022-03-17T21:31:46+05:30 IST