వరి ధాన్యం పై పోరుకు పార్టీ శ్రేణులు తరలి రావాలి: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-04-03T22:48:33+05:30 IST

తెలంగాణలో లో రైతులు పండించిన ఈ యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నిర్వహించనున్న మండల కేంద్రాల లో ధర్నా, ఆందోళన కార్యక్రమాలకు రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు

వరి ధాన్యం పై పోరుకు పార్టీ శ్రేణులు తరలి రావాలి: ఎర్రబెల్లి

హైదరాబాద్: తెలంగాణలో లో రైతులు పండించిన ఈ యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నిర్వహించనున్న మండల కేంద్రాల లో ధర్నా, ఆందోళన కార్యక్రమాలకు రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ టెలీ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, జిల్లా పరిషత్ చైర్మన్ లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు వివిధ విభాగాల జిల్లా,  నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్  అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరి ధాన్యం కొనుగోలు పై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించారని అన్నారు. 4 సోమవారం మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు. 6వ తేదీన జాతీయ రహదారులపై రాస్తారోకో (1. అదిలాబాద్ నాగాపూర్ జాతీయ రహదారి 2. ముంబయి జాతీయ రహదారి 3. బెంగుళూరు జాతీయ రహదారి4. విజయవాడ జాతీయ రహదారి) అయితే ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోకి రాదని ఆరోజు జాతీయ రహదారుల బంధ కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఉండదని మంత్రి చెప్పారు. కాగా, 7వ తేదీన జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు.  8న గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు, ప్రతి రైతు ఇంటిపై నల్లజండాలు ఎగరవేయడం, మునిసిపాలిటీల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాల ఎగురవేయాలని చెప్పారు. 11న  ఢిల్లీలో నిరసన దీక్ష ఉంటుందన్నారు. 

Updated Date - 2022-04-03T22:48:33+05:30 IST