పాలమూరు జిల్లా పై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ

ABN , First Publish Date - 2022-01-17T22:48:05+05:30 IST

వెనుకబడిన పాలమూరు జిల్లా అభివృద్ధి పై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు.

పాలమూరు జిల్లా పై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ

హైదరాబాద్: వెనుకబడిన పాలమూరు జిల్లా అభివృద్ధి పై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను మరింతగా అభివృద్ధి చేసే బాధ్యతను ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీ లు, సర్పంచులు తీసుకోవాలని మంత్రులు కోరారు. అలాగే ప్రజా ప్రతినిధులు సూచించిన పనులు, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ పై అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని అదేశించారు. సీఎం కెసీఆర్ ఆదేశాలమేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పథకాల అమలు తీరుతెన్నులపై రాష్ట్ర  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు కూచకుల్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, పీవీ వాణి దేవి, ఎమ్మెల్యేలు చర్లకోల లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, మహేశ్వర రెడ్డి, చిట్టెం రామ్ మోహన్ రెడ్డి, అలా వెంకటేశ్వర రెడ్డి, అబ్రహం, పట్నం నరేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, క్రాంతి కిరణ్ తదితరులు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.


 ప్రగతిలో ఉన్న అన్ని పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, ఈ మార్చి కల్లా మిగతా పనులన్నీ పూర్తి చేయాలని, సమస్యలు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేల దృష్టికి తేవాలని, ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో మండలాల వారీగా సమీక్షించి, అభివృద్ధిని పరుగులు పెట్టించాలని సూచించారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఉపాధి హామీ నిధుల వినియోగ0లో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. తాజాగా పంచాయతీ భవనాలు, కాలువల పూడిక తీత వంటి పనులకు కూడా ఉపాధి నిధులను వినియోగించుకోవాలని అధికారులకు చెప్పారు. అంతేగాక ఈ మార్చిలో గా సాధ్యమైనంత ఎక్కువ ఉపాధి పనులు చేయాలని అదేశించారు.


కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన గ్రామ పంచాయతీలు, ఎస్సీ రిజర్వు గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాలకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగం పై సీఎం ఆదేశానుసారం నడుచుకుంటానని అన్నారు. ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, రోడ్ల నిర్వహణ వంటి విషయాల్లో అధికారులు ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని అభివృద్ధి పనులు నిర్వహించాలన్నారు. కొత్త రోడ్లు, మురుగునీటి కాలువల పనులు కూడా త్వరలోనే వస్తాయని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.


ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గతంలో సీఎం కెసిఆర్ ఆదేశించిన మేరకు కోయిల్ సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని డ్రింకింగ్ వాటర్ కు కేటాయించాలన్నారు. మన్నెం కొండ టెంపుల్ వద్ద వాటర్ టాంక్ కట్టాం. వేస్ట్ వాటర్ ను కింద చెరువుకు పోవాలి అన్నారు. ఇక్కడ ఈ మేరకు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎం కేసిఆర్  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గురించే చెప్పారు. అంటే అందుకు తగ్గట్లుగా, నిధులు అధికంగా ఇవ్వండి అని కోరారు. అలాగే పెండింగ్ బిల్లులు ఉంటే వెంటనే క్లియర్ చేయాలి. సీఎం  ఆదేశించిన విధంగా పనులు జరిగేట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు చెప్పే పనులకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. అని మంత్రి సూచించారు.

Updated Date - 2022-01-17T22:48:05+05:30 IST