ఘనంగా ముగిసిన సేవాలాల్ జయంతి ఉత్సవాలు
ABN , First Publish Date - 2021-03-01T20:38:22+05:30 IST
జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలో భారీ ఎత్తున జరిగిన గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి.
జనగామ: జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలో భారీ ఎత్తున జరిగిన గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గిరిజనులు ఉత్సవాలకు హాజరయ్యారు. ముగింపు రోజున రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్రావు ఉత్సవాలకు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి గిరిజనులతో కలిసి ఆడిపాడారు. వారితో డాన్స్చేస్తూస్టెప్పులు వేయడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఈలలు,చప్పట్లతో అభినందించారు. గిరిజనులు ఎంతో ఆనందోత్సహాల మధ్య ఈ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమని ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.