కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ను కలిసిన మంత్రి Errabelli
ABN , First Publish Date - 2022-06-30T22:37:12+05:30 IST
నగరంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ కార్యాలయాన్ని(NIRD-PR) కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరి రాజ్ సింగ్(giriraj singh) గురువారం సందర్శించారు.
హైదరాబాద్: నగరంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ కార్యాలయాన్ని(NIRD-PR) కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరి రాజ్ సింగ్(giriraj singh) గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు(errabelli dayakar rao) ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మూడు ముఖ్యాంశాలపై ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఇందులో శ్యాంప్రసాద్ ముఖర్జీ రూరల్ మిషన్ పనులను రాష్ట్రంలోనూ పునరుద్దరించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న పంచాయితీరాజ్ శాఖ భవనాలకు ప్రస్తుం ఉపాధి హామీపధకం కింద ఇస్తున్న 20 లక్షల నిధులను 25లక్షలకు పెంచాలని కోరారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కొంద రాష్ట్రంలో కొత్తగా వెయ్యి నూతన పంచాయితీ భవనాలు మంజూరుచేసి నిధులు విడుదల చేయాలని అన్నారు.