ఆటా మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన మంత్రి ఎర్ర‌బెల్లి

ABN , First Publish Date - 2022-07-01T20:44:59+05:30 IST

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గురువారం రాత్రి అమెరికా వెళ్లారు.

ఆటా మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన మంత్రి ఎర్ర‌బెల్లి

హైదరాబాద్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గురువారం రాత్రి అమెరికా వెళ్లారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో శుక్రవారం నుంచి ఈ నెల 3వ తేదీ వరకు ఆటా మహాసభలు జరుగుతున్నాయి. యూత్ కన్వెన్షన్ లో పాల్గొనాల్సిందింగా మంత్రి ఎర్ర‌బెల్లిని ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 2 న ఆటా మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మంత్రి ప్ర‌సంగిస్తారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన ప‌లు కార్య‌క్ర‌మాల్లో మంత్రి పాల్గొంటారు. ప్రతిష్టాత్మకంగా ఆటా నిర్వహించే ఈ వేడుకలు ఈ సంవత్సరం మరింత పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. వందలాదిగా వలంటీర్లు వివిధ ఏర్పాట్ల కోసం 80 కమిటీలుగా ఏర్పడి ఇందుకోసం శ్రమిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు.

Updated Date - 2022-07-01T20:44:59+05:30 IST