Errabelli dayakar rao: బీజేపీ నాయకుల రెచ్చగొట్టే మాటలు విని ఆగం కావద్దు

ABN , First Publish Date - 2022-08-29T15:42:12+05:30 IST

తెలంగాణ అభివృద్దిని చూసి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Errabelli dayakar rao: బీజేపీ నాయకుల రెచ్చగొట్టే మాటలు విని ఆగం కావద్దు

వరంగల్: తెలంగాణ అభివృద్దిని చూసి ఓర్వలేకనే బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) విమర్శలు చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli dayakar rao) అన్నారు. సోమవారం ఉదయం రాయపర్తి మండలం కొండూరులో 14 కోట్ల50 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను మంత్రి (Minister errabelli dayakar rao) ప్రారంభించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ... విమర్శలు చేసే ముందు తెలంగాణలో అమలవుతున్న పథకాలు.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నయా? ఆలోచించాలన్నారు. బీజేపీ నాయకుల రెచ్చగొట్టే మాటలు విని ఆగం కావద్దని అన్నారు. రైతు సంక్షేమానికి కేసీఆర్ (CM KCR) కృషి చేస్తుంటే.. రైతుల నడ్డి విరిచేలా బీజేపీ కుట్రలుచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల కేసీఆర్ (Chief minister) పాలనలో తెలంగాణ అభివృద్ది చెందుతుందని తెలిపారు. తెలంగాణ (Telangana) పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-29T15:42:12+05:30 IST