కార్మికులను కేంద్రం ఇబ్బంది పెడుతోంది: మంత్రి Errabelli
ABN , First Publish Date - 2022-05-27T18:35:27+05:30 IST
కార్మికుల సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
హనుమకొండ: కార్మికుల సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli dayakar rao) అన్నారు. శుక్రవారం కార్మిక మాసోత్సవంలో మంత్రి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం(Central government) కార్మికులంటేనే ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వస్తే చాలా ఉద్యోగాలు వచ్చేవని... కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) తొక్కిపడేశాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కార్మికులను నాశనం చేశాయని విమర్శించారు. బీజేపీ ప్రైవేటు వ్యవస్థను తీసుకువస్తోందని.. అన్నీ ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయరంగాన్ని కేంద్రప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.