మోడీని ఏ జైళ్లో పెట్టాలి: మంత్రి ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2022-01-28T22:07:40+05:30 IST
తాము అధికారంలోకి రెండుకోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పి మోసం చేసిన ప్రధాని మోదీని
హన్మకొండ: తాము అధికారంలోకి వస్తే రెండుకోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పి మోసం చేసిన ప్రధాని మోదీని ఏ జైళ్లో పెట్టాలని బీజేపీ నాయకులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. నగరంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. వరంగల్లో మిర్చి రైతుల పరామర్శకు వెళ్లిన ఈటల రాజేందర్, రైతులకు ఎం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. బయ్యారం పర్యటనకు ఈటల వస్తే స్థానికులు అడ్డుకున్నారన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందో ప్రజలకు ఈటల సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదన్నారు. ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందన్నారు. మేడారం జాతరకు ఇస్తామన్న జాతీయ హోదా ఏమైందని ఆయన ప్రశ్నించారు. మహబూబాబాద్లో గిరిజన యూనివర్సిటీ ఏమైందని ఆయన నిలదీశారు. ల్యాండ్ ఇచ్చినా పనులు ప్రారంభం కాలేదన్నారు. కేసీఆర్పై బండి సంజయ్, కిషన్రెడ్డి పిచ్చిమాటలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. కేసీఆర్పై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.