మల్లు స్వరాజ్యంకు మంత్రి ఎర్రబెల్లి నివాళి

ABN , First Publish Date - 2022-03-20T19:59:21+05:30 IST

స్వాతంత్ర్య, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్థివ దేహం వద్ద రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్ప గుచ్చాలు ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు

మల్లు స్వరాజ్యంకు మంత్రి ఎర్రబెల్లి నివాళి

హైదరాబాద్: స్వాతంత్ర్య, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్థివ దేహం వద్ద రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్ప గుచ్చాలు ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు.ఆమె ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చారు. తమ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నిజాం సర్కారును ఎదిరించారని గుర్తు చేశారు.తూటా లా పేలే తన మాటను పాటగా మార్చి అనేక మంది ప్రజలను, ప్రత్యేకించి మహిళలను చైతన్య పరిచారని అన్నారు. సాయుధ పోరాట యోధురాలిగా నాడు అదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పని చేశారని అన్నారు. ప్రత్యేకించి పాలకుర్తి లో చాకలి ఐలమ్మ, దేవులపల్లి వెంకటేశ్వరావు, పుచ్చలపల్లి సుందరయ్య, తన సోదరుడు భీం రెడ్డి నరసింహ రెడ్డి వంటి ఉద్ధండులతో కలిసి పని చేశారని గుర్తు చేసుకున్నారు. 


ఆమె నడయాడిన నేల పాలకుర్తి ప్రాంతం ఇప్పటికీ చైతన్యం గల ప్రాంతం.మల్లు స్వరాజ్యం బతికి ఉన్నన్ని రోజులు పాలకుర్తి కి పలు సందర్భాల్లో వస్తూ ఉండేవారు.వారికి, పాలకుర్తి ప్రాంతానికి విడదీయరాని అనుబంధం ఉందని అన్నారు. ఆమె జీవితం మహిళా లోకానికి, ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమానికి అమే స్ఫూర్తిగా నిలిచారన్నారు.మల్లు స్వరాజ్యం జీవిత చరిత్ర ను భవిష్యత్ తరాలకు అందించటానికి నా వంతు సహకారం అందిస్తానని, ఆమె లేని లోటు తీర్చలేనిదన్నారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంట సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య తదితరులు ఉన్నారు.


కాగా,

మల్లు స్వరాజ్యం పార్థివ దేహాన్ని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సీపీఎం కార్యాలయం మాకినేని బసవ పున్నయ్య భవనంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు.

Updated Date - 2022-03-20T19:59:21+05:30 IST