ప్రతి నెలా పెన్షన్లు ఇస్తున్న ఘనత కేసీఆర్ దే: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-02-28T23:27:37+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెలా క్రమం తప్పకుండా పెన్షన్లు అందిస్తున్న ఘతన ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

ప్రతి నెలా పెన్షన్లు ఇస్తున్న ఘనత కేసీఆర్ దే: మంత్రి ఎర్రబెల్లి

వికారాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెలా క్రమం తప్పకుండా పెన్షన్లు అందిస్తున్న ఘతన ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కరోనా కాలంలో ఇతర రాష్ట్రాలు నిలిపివేయగా తెలంగాణలోనే సక్రమంగా పెన్షన్లు అందుతున్నాయన్నారు.రాష్ట్రంలో నూటికి అరవై ఒక్క శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని అందువల్ల రాష్ట్రంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె ప్రగతి కింద 2019 సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు 8 వేల 6 వందల 29 కోట్ల రూపాయలు గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్ గా విడుదల చేశామని మంత్రి చెప్పారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో  రూ.5.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జిల్లా ప్రజా పరిషత్ నూతన భవన నిర్మాణపు పనులకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలసి శంకుస్థాపన చేసారు. 


ఈ సందర్బంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా 1300 వందల కోట్లు నిధులను వికారాబాద్ జిల్లాకు కేటాయించి జిల్లాలోని అన్ని అవాసాలకు సురక్షితమైన తాగునీటి సదుపాయం కల్పించామని ఆయన తెలిపారు.ప్రభుత్వం అందించిన పథకాలు,నిధుల వివరాలు గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేయాలని మంత్రి కోరారు. వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి  8 వేల కోట్ల రూపాయలు  కేటాయించినట్లు ఆయన తెలిపారు. వికారాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికి జడ్పీటీసీలకు 15 లక్షలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.  


ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేకపోతే కొన్ని మైలు రాళ్లు రాష్ట్రం అందుకోక పోతుండేదని, తెలంగాణ సాధన ఆయనతోనే సాధ్యం అయ్యిందని తెలిపారు.  బంగారు తెలంగాణ నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమవుతుందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ చరిత్రలో నిలిచిపోతుందని, ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎత్తిపోతల పథకం కేవలం మూడేళ్ళ కాలంలో పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని అన్నారు.మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో అన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు.పల్లె ప్రగతి ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు గణనీయంగా అభివృద్ధి చెందాయాని అన్నారు. 


Updated Date - 2022-02-28T23:27:37+05:30 IST