గంగపుత్రుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-02-04T20:10:24+05:30 IST

తెలంగాణలో గంగపుత్రుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

గంగపుత్రుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు: ఎర్రబెల్లి

హనుమకొండ: తెలంగాణలో గంగపుత్రుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని కులాల వారికి పలు రకాల పథకాలు అమలుచేస్తూ వారి ఉన్నతికి పాటు పడుతున్నారని అన్నారు. శుక్రవారం హన్మకొండలోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో వరంగల్ జిల్లా గంగపుత్ర (బెస్త) పరస్పర సహాయ సహకార గృహనిర్మాణ సంఘం 2022 సంవత్సరపు డైరీని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గంగపుత్రుల అభివృద్ధికి సంక్షేమానికి ఎన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నారని అన్నారు. 


ఈ పథకాలు నిరుపేద గంగపుత్రులు వినియోగించుకునే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో గంగపుత్ర (బెస్త) పరస్పర సహాయ సహకార గృహనిర్మాణ పరపతి సంఘం వరంగల్ శాఖ అధ్యక్షులు డోలి రాజలింగం, కార్యదర్శి పారిపల్లి రాజేంద్ర కుమార్, ఉపాధ్యక్షులు పాక వీరస్వామి, సంయుక్త కార్యదర్శి ఏలుగు వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు, సంఘ బాధ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-04T20:10:24+05:30 IST