సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఉద్యోగుల పాత్ర గణనీయం: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-01-31T00:14:07+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అధికారులు, ఉద్యోగులు చేస్తున్న కృషి గణనీయమైనదని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభిృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఉద్యోగుల పాత్ర గణనీయం: ఎర్రబెల్లి

హనుమకొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు  అధికారులు, ఉద్యోగులు  చేస్తున్న కృషి గణనీయమైనదని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభిృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.ఆదివారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో  పర్యాటక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో  కలిసి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం 2022 సంవత్సరపు డైరీ, క్యాలండర్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సమైఖ్య రాష్ట్రంలో అన్ని విధాలుగా తెలంగాణ  అణిచివేతకు గురైనదని అన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ర్టంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటూన్నారని అన్నారు.


పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో  అన్ని వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విషయం కేంద్ర ప్రభుత్వ వివిధ అవార్డుల ద్వారా గుర్తించిందని గుర్తుకు చేశారు.మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సమైఖ్య రాష్ట్రంలో అన్ని విధాలుగా విద్యా, ఉపాధి, నిధులు, నియామకాలలో వారికి అనుకూలంగా పనులు చేసుకుంటూ మనకు  తీవ్ర నష్టం కల్గీంచారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఐనా తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన పీఆర్సీ, ఒక్కేసారి నాలుబై వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం చాల గొప్ప విషయం అని చెప్పారు. 


ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు ఐతే బాగుండు అని చెప్పుకుంటున్నారని గుర్తుకు చేశారు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, టిఎన్జీఓలు అంటే తనకు కుటుంబం విధంగా భావించి వారి విజ్ఞప్తిలు, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని వారికి ఉంటానని ఆయన అన్నారు. టిజిఓ భవనం విస్తరణ కోసం వెంటనే పది లక్షలు నిధులు మంజూరు చేస్తూన్నని ఆయన తెలిపారు.కార్యక్రమం టీజీఓ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్ రావు,జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-31T00:14:07+05:30 IST