రైతుబంధు ద్వారా రూ.50వేల కోట్ల సాయం అందించాం: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-01-10T21:48:45+05:30 IST

రాష్ట్రంలో 2018 సంవత్సరంలో రైతుబంధు కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి ఈ రోజు (సోమవారం) వరకు 64 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 50 వేల కోట్ల రూపాయలను రైతు బంధు సహాయాన్ని జమ చేసినట్లు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

రైతుబంధు ద్వారా రూ.50వేల కోట్ల సాయం అందించాం: ఎర్రబెల్లి

హైదరాబాద్: రాష్ట్రంలో 2018 సంవత్సరంలో రైతుబంధు కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి ఈ రోజు (సోమవారం) వరకు 64 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 50 వేల కోట్ల రూపాయలను రైతు బంధు సహాయాన్ని జమ చేసినట్లు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అందులో భాగంగా 5 వేల 849 కోట్ల రూపాయలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతుల ఖాతాల్లో రైతు బంధు సహాయాన్ని జమ చేశామని ఆయన తెలిపారు. జనగామ జిల్లాలో 1481 కోట్ల 73 లక్షల రూపాయలు, వరంగల్ జిల్లాలో 940 కోట్ల 51 లక్షల రూపాయలు, హన్మకొండ జిల్లాలో 916 కోట్ల 79 లక్షల రూపాయలు, జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలో 756 కోట్ల రూపాయలు, మహబూబాబాద్ జిల్లాలో 1273 కోట్ల రూపాయలు, ములుగు జిల్లాలో 481 కోట్ల 96 లక్షల రూపాయలు రైతుబంధు పథకం కింద రైతులకు ఆర్ధిక సహాయం అందించామని మంత్రి తెలిపారు. 


బంగారు తెలంగాణ సాధన దిశగా సీఎం కేసీఆర్ మానసపుత్రిక రైతుబంధు ద్వారా అన్నదాతలకు అందిన పంట పెట్టుబడి సాయం సోమవారం నాటికి 50 వేల కోట్ల రూపాయలకు చేరిన సందర్బంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. డెబ్భై ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏనాడు, ఎవ్వరు చరిత్రలో ఎప్పుడు అందించని విధంగా రైతుల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించి గొప్ప కార్యక్రమమైన రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు. 


రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారని,రైతుబంధు ముగ్గులు వేసి మహిళలు ఆశీర్వాదం ఇచ్చారని, అయన తెలిపారు. వేల సంఖ్యలో రైతులు తమ ఎండ్లబండ్లు ప్రదర్శనలు చేసి ఉరూరా పండుగ వాతావరణం తీసుకొచ్చారన్నారు. పొలాల్లో కేసీఆర్ రైతుబంధు పేరుతో తమ అభిమానాన్ని చాటుకున్నారని అయన అన్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సంక్రాంతి వరకు రైతు బంధు సంబరాలు నిర్వహించాలని అయన పిలుపిచ్చారు.

Updated Date - 2022-01-10T21:48:45+05:30 IST