మహాత్మా పూలేకు ఘనంగా నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-11-28T20:36:13+05:30 IST

మహాత్మా జ్యోతి రావు ఫూలే వర్ధంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు

మహాత్మా పూలేకు ఘనంగా నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: మహాత్మా జ్యోతి రావు ఫూలే  వర్ధంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.ఫూలే స్పూర్తితోనే తెలంగాణలో సీఎం కేసిఆర్ పరిపాలన చేస్తున్నారని అన్నారు.మహాత్మా జ్యోతిరావు ఫూలే కన్న కలలు సాకారం చేసే విధంగా సీఎం కేసిఆర్ పనిచేస్తున్నారు. ఫూలే పేరుతోనే బీసీల విద్యకు, ఉపాధికి పెద్దపీట వేసి ఆ వర్గాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.


తన సతీమణి సావిత్రి ఫూలేని చదివించి, ఆమె ద్వారా మహిళలను విద్యావంతులను చేసిన ఘనత ఫూలేదని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.ఫూలే స్ఫూర్తి, చొరవను సీఎం కేసిఆర్ కొనసాగిస్తున్నారని, సబ్బండ వర్గాల కోసం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.దేశంలో ఎక్కడా లేని ఆయా పథకాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి.ఈ సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతి రావు ఫూలే కన్న కలలను సాకారం చేసేది ఒక్క  ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రమేనని తెలిపారు.

Updated Date - 2021-11-28T20:36:13+05:30 IST