ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీల్లో విద్యాబోధన

ABN , First Publish Date - 2021-11-08T22:42:44+05:30 IST

ప్రవేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యాబోధనతో పాటు వనరులు వసతులు కల్పిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు

ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీల్లో విద్యాబోధన

మహబూబాబాద్: ప్రవేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యాబోధనతో పాటు వనరులు వసతులు కల్పిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లాలోని తోర్రుర్ లో 3 కోట్ల90 లక్షల రూపాయల వ్యయంతో 2.1/2 ఎకరాల్లో నిర్మించిన నూతన డిగ్రీ కళాశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  2008-09 సంవత్సరంలో తొర్రూర్ లో డిగ్రీ కళాశాల ప్రారంభం అయిందని, కళాశాల వసతి లేక విద్యార్థులు అధ్యాపకులు చాలా ఇబ్బందులు పడ్డారని,  గత 5 సంవత్సరాలుగా సొంత భవన నిర్మాణ కోసం గేల్ వారికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, మంజూరు చేసిన సీఎస్ఆర్ నిధులతో ప్రత్యక్షంగా  పూర్తి దశల్లో నిర్మించుకొని నేడు ప్రారంభించుకోవడం సంతోషమని మంత్రి చెప్పారు.


తొర్రూరు వాసులు గతంలో కనీస వసతులు లేక, చదవాలంటే సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లేవారని రూమ్ కిరాయిలు కట్టలేక , సుదీర్ఘ ప్రాంతం వెళ్ళలేక అనేకమంది విద్యకు దూరమయ్యారని, అన్నారు.కళాశాల అభివృద్ధికి ప్రతి అధ్యాపకులు విశిష్ట కృషి చెయ్యాలని, విద్యార్ధిని,విద్యార్థులు ఈ సదుపాయాలను, వసతులను సద్వినియోగం చేసుకోవాలని, ఈ ప్రాంతం విద్యారంగంలో మంచి ఫలితాలు సాధించాలని, చక్కటి భవిష్యత్తును నిర్దేశించుకోవాలని అన్నారు. ఇక ఉపాధ్యాయులు విద్యార్థులు సమయ పాలన పాటించాలని, చదువుతోపాటు క్రీడారంగంలో, కళా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలన్నారు. 


క్రీడా మైదానం అభివృద్ధికి, ఆట పరికరాలకు, సైన్స్ ల్యాబ్ లకు, ఫర్నిచర్ ను అందించేందుకు తాను కృషి చేస్తానని మంత్రి దయాకర్ రావు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, డి పి ఓ సాయి బాబా,  మున్సిపల్ చైర్ పర్సన్ రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు, ఎంపీపీ అంజయ్య, జెడ్ పి టి సి శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, గేల్ జోనల్ మేనేజర్ శరత్ త్రీపాఠి, సీనియర్ మేనేజర్ బాలాజీ కుమారస్వామి ఆర్డిఓ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-08T22:42:44+05:30 IST