మంత్రి ఎర్రబెల్లిని కలిసిన సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు
ABN , First Publish Date - 2021-10-18T20:12:08+05:30 IST
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని పలువురు జిల్లా పరిషత్ ల సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సోమవారం కలిశారు.
హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని పలువురు జిల్లా పరిషత్ ల సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సోమవారం కలిశారు. తమకు పదోన్నతులు కల్పించినందులకు మంత్రికి వారు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా, ప్రజలకు ప్రభుత్వ పథకాలన్నీ సకాలంలో అందేవిధంగా పని చేయాలని మంత్రి ఈ సందర్భంగా వారిని ఆదేశించారు. మంత్రిని కలిసిన వారిలో సీఈఓలు, డిప్యూటీ సీఈఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేందర్ రావు, ఎంపీడీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సత్తయ్య, పలువురు సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు ఉన్నారు.