త్వరలో వరంగల్ నుండి విమానాల రాకపోకలు:మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-09-13T00:48:26+05:30 IST

త్వరలోనే వరంగల్ (మామునూరు)ఎయిర్ పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు

త్వరలో వరంగల్ నుండి విమానాల రాకపోకలు:మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: త్వరలోనే వరంగల్ (మామునూరు)ఎయిర్ పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థన మేరకు కేంద్ర విమానయాన శాఖమంత్రి జ్యోతిరాధిత్య సింధియా హామీ ఇచ్చినందుకు సీఎం కేసిఆర్కి, కేంద్ర మంత్రి సింధియాకు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి సింధియా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు.


ఈ సందర్భంలో వరంగల్(మామునూర్) విమానాశ్రయం నుండి విమానాలు నడపాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి సింధియాను కోరారు. కోరిన వెంటనే తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతిపాదనలో ఉన్న 6 ఎయిర్ పోర్టుల్లో ఒకటైన వరంగల్ (మామునూరు) ఎయిర్ పోర్టు అథారిటీ లాండ్(ఏఐ) ఏటీఆర్ ఆపరేషన్స్ త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.దీంతో త్వరలోనే వరంగల్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. 


Updated Date - 2021-09-13T00:48:26+05:30 IST