జాతీయ స‌భ‌ల‌కు వ‌చ్చారా? తెలంగాణ‌పై దాడికి దిగారా?

ABN , First Publish Date - 2022-07-04T23:44:14+05:30 IST

బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ మ‌హా స‌భ‌లు, బ‌హిరంగ స‌భ జ‌రిగిన తీరు, బిజెపి నేత‌ల వ్య‌వ‌హార శైలి, ప్ర‌వ‌ర్తించిన తీరు, దిగిన మాట‌ల దాడిపై రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు ఫైర్ అయ్యారు.

జాతీయ స‌భ‌ల‌కు వ‌చ్చారా? తెలంగాణ‌పై దాడికి దిగారా?

హైదరాబాద్: బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ మ‌హా స‌భ‌లు, బ‌హిరంగ స‌భ జ‌రిగిన తీరు, బిజెపి నేత‌ల వ్య‌వ‌హార శైలి, ప్ర‌వ‌ర్తించిన తీరు, దిగిన మాట‌ల దాడిపై రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు ఫైర్ అయ్యారు.స‌భ‌లు పెట్టుకోవ‌డానికి ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని, కానీ, స‌భ‌ల పేరుతో తెలంగాణ ప్ర‌భుత్వంపై, మా సీఎం కేసిఆర్ పై చేసిన దాడి అంతా ఇంతా కాద‌న్నారు. ఈ దాడి మొత్తం తెలంగాణ ప్ర‌జానీకంపై జ‌రిగిన‌దిగా భావిస్తున్నామ‌నిఆయన అన్నారు. 


మోడీ కేసిఆర్ పేరు ఎత్త‌లేదు. కానీ, ఆయ‌న భ‌జ‌న గ‌ణం అంతా క‌లిసి, ప్ర‌త్య‌క్షంగా తెలంగాణ సీఎం కేసిఆర్ పై దాడి చేసి, తెలంగాణ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశార‌న్నారు. బిజెపిది ద‌క్షినాదిన‌, అందులో తెలంగాణ‌పై అధికారం యావ త‌ప్ప‌, ప్ర‌జ‌లు, అభివృద్ధి, సంక్షేమాల‌పై లేద‌ని మ‌రోసారి తేలింద‌న్నారు. అబ‌ద్ధాలు వ‌ల్లించ‌డం, మోసం చేయ‌డం, మ‌త విధ్వేషాలు రెచ్చ‌గొట్టి, దేశ భ‌క్తి సెంటిమెంట్ల‌ను బాగా పండించి ఓట్లు దండుకునే రాజ‌కీయాలు తెలంగాణ‌లో సాగ‌వ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు. ఉత్త‌ర భార‌త దేశంలో లా తెలంగాణ‌లో బిజెపి ఆట‌లు సాగ‌వ‌ని, ఇక్క‌డి ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, బిజెపికి త‌గిన బుద్ధి చెప్పే రోజులు వ‌స్తాయ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు.

Updated Date - 2022-07-04T23:44:14+05:30 IST