దేశం కోసం రాకేశ్ ఆత్మబలిదానం చేశాడు: మంత్రErrabelli

ABN , First Publish Date - 2022-06-27T20:34:45+05:30 IST

దేశం కోసం రాకేశ్ అంకితమయ్యాడని, రాకేశ్(rakesh) ఆత్మ బలిదానం వృథా కాదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao)అన్నారు.

దేశం కోసం రాకేశ్ ఆత్మబలిదానం చేశాడు: మంత్రErrabelli

వరంగల్: దేశం కోసం రాకేశ్ అంకితమయ్యాడని, రాకేశ్(rakesh) ఆత్మ బలిదానం వృథా కాదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao)అన్నారు.సైనికులలో చేరాలనే కాంక్షతో దేశ భక్తి కి స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడారు.వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, దబ్బిర్ పేట గ్రామంలో రాకేశ్ సంస్మరణ సభ సోమవారం జరిగింది. ఈ సభలో రాకేశ్ కుటుంబానికి సీఎం కేసిఆర్ ప్రకటించిన 25 లక్షల ఎక్స్ గ్రేషీయా, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం నియామక పాత్రలను మంత్రి ఎర్రబెల్లి రాకేశ్ కుటుంబ సభ్యులకు అందచేశారు.ఈసందర్భంగామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఇంత జరిగినా రాకేశ్ కుటుంబాన్ని కేంద్రం ఆదు కోలేదని,సీఎం కేసిఆర్ మానవతా దృక్పథంతో ఆదుకున్నారని అన్నారు. 


వాళ్ళ ఇంటిలో ఒకరికి రెవెన్యూ విభాగంలో వారి విద్యార్హత ను బట్టి ఆఫీస్ సబార్డి నేట్ ఉద్యోగం ఇచ్చారని చెప్పారు.మూల పోడు చేసుకుని బతికే గ్రామం నుంచి దేశ రక్షణకు వెళ్ళాలని అనుకున్న రాకేశ్ గొప్ప తనం అందరికీ ఆదర్శమని అన్నారు.రాకేశ్ ఆత్మ శాంతించాలంటే వెంటనే అగ్నీపధ్ ను వెనక్కి తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని,మన సీఎం కేసిఆర్ తరహాలో దేశ వ్యాప్తంగా చనిపోయిన రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా దబ్బిర్ పేట గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్నట్టు మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు.


ఈ గ్రామ అభివృద్ధి నా బాధ్యత అని, దబ్బిర్ పేట లో వివిధ అభివృద్ధి పనులకు 50 లక్షలు మంజూరు చేస్తున్న తెలిపారు.కేవ్ లా తండాకు 20 లక్షలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.దళిత బంధు, ఇండ్లు వంటి ఏ పథకాలు వచ్చినా దబ్బిర్ పేట కు అధిక ప్రాధాన్యం ఇస్తానని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా టీఆరెఎస్ అధ్యక్షుడు ఆరూరీ రమేశ్, జిల్లా కలెక్టర్ గోపి, ఆర్డీఓ, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచ్, రాకేశ్ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T20:34:45+05:30 IST