తెలంగాణలో సాహిత్యానికి గుర్తింపు తెచ్చింది కేసీఆర్:Errabelli

ABN , First Publish Date - 2022-06-17T20:53:06+05:30 IST

తెలంగాణలో సాహిత్యానికి గుర్తింపు తీసుకు వచ్చింది సీఎం కేసీఆర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు.

తెలంగాణలో సాహిత్యానికి గుర్తింపు తెచ్చింది కేసీఆర్:Errabelli

హైదరాబాద్: తెలంగాణలో సాహిత్యానికి గుర్తింపు తీసుకు వచ్చింది సీఎం కేసీఆర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు. కేసీఆర్ కళల పట్ల మమకారంతో ఉన్నారని, కేసీఆర్ చొరవతో సాహిత్యానికి ఎంతో గుర్తింపు వచ్చిందన్నారు.ర‌వీంద్ర భార‌తిలో గోపాల్ రెడ్డి, సురేంద‌ర్  నిర్వ‌హిస్తున్న శిల్పకళా ప్రదర్శనను(art exbition) ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారితో క‌లిసి మంత్రి ఎర్ర‌బెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే కళలు,సాహిత్యానికి ఎంతో గుర్తింపు లభిస్తోందన్నారు.


ఇలాంటి ఎగ్జిబిషన్ ల ద్వారా కొత్త కళాకారులకు ఉత్సాహంగా, ప్రోత్సాహం వుంటుందన్నారు.శిల్ప క‌ళా కారులు  గోపాల్ రెడ్డి, సురేంద‌ర్ ల‌కు మంచి భవిష్యత్ వుందన్నారు.ఈ సంద‌ర్భంగా శిల్ప‌క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌ను ప‌రిశీలించారు.శిల్ప‌క‌ళాకృతుల‌ను చూసి,క‌ళాకారులు గోపాల్ రెడ్డి,సురేంద‌ర్ ల‌ను అభినందించారు.ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్ట‌ర్ మామిడి హ‌రి కృష్ణ‌, దైవ‌జ్ఞ‌శ‌ర్మ‌, పలువురు క‌ళాకారులు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-17T20:53:06+05:30 IST