Free training నిరుద్యోగులకు ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ శిబిరం: Errabelli

ABN , First Publish Date - 2022-05-16T22:06:34+05:30 IST

నిరుద్యోగ యువతకు ఉచితంగా ఉపాధి, ఉద్యోగం కోసం ఉచితంగా శిక్షణ శిబిరాన్ని పాలకుర్తి బషారత్ గార్డెన్స్ లో ఎర్రబెల్లి ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) తెలిపారు

Free training నిరుద్యోగులకు ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ శిబిరం: Errabelli

పాలకుర్తి: నిరుద్యోగ యువతకు ఉచితంగా ఉపాధి, ఉద్యోగం కోసం ఉచితంగా శిక్షణ శిబిరాన్ని పాలకుర్తి బషారత్ గార్డెన్స్ లో ఎర్రబెల్లి ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) తెలిపారు. సోమవారం ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పిల్లలకు పెడుతున్న భోజన వసతి ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం శిక్షణకు వచ్చిన ఉద్యోగార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఉషా దయాకర్ రావు అధ్వర్యంలో ఎర్రబెల్లి ట్రస్ట్ సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.


అత్యంత నిజాయితీతో ఈ సేవా కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. కరోనా సమయంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, అంబులెన్స్ లు వంటివి ఎన్నో చేశాం.అలాగే ఈ ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ శిక్షణ ద్వారా ఇప్పటికే వెయ్యి మందికి పైగా వివిధ ఉద్యోగాలు పొందారని అన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులకు అందుబాటులో ఉండటానికి వీలుగా అటు తొర్రూరు లో తొర్రూరు, రాయపర్తి, పెద్ద వంగర మండలాలకు,ఇటు పాలకుర్తిలో పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల వాళ్లకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ శిక్షణ వల్ల ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు పొందారు.మరికొంత మంది ఉద్యోగాలు పొందాలన్నదే మా సంకల్పమని మంత్రి పేర్కొన్నారు.


పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చుని కష్టపడి చదవండి.ఇష్టమైన ఉద్యోగాన్ని పొందాలని సూచించారు.ప్రభుత్వం కూడా నోటిఫికేషన్లు వేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1 లక్ష 30 వేల ఉద్యోగాలు ఇచ్చింది. తాజా గా 85 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనే వాళ్లకు ఇది మంచి అవకాశమని అన్నారు.మాన‌వ వ‌న‌రుల అభివృద్ధికి విద్యే ప్ర‌ధానమని,విద్య ద్వారానే అన్ని రంగాల్లో రాణించ‌వ‌చ్చని చెప్పారు.నైపుణ్యంతో కూడుకున్న మాన‌వ స‌మాజ నిర్మాణం జ‌ర‌గాలన్నారు. 

Updated Date - 2022-05-16T22:06:34+05:30 IST