క్లబ్బుల్లో తిరిగే రాహుల్ గాంధీకి రైతుల గురించి మాట్లాడే హక్కులేదు: Erra belli

ABN , First Publish Date - 2022-05-06T01:25:37+05:30 IST

క్లబ్బుల్లో తిరిగే రాహుల్ గాంధీకి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు

క్లబ్బుల్లో తిరిగే రాహుల్ గాంధీకి రైతుల గురించి మాట్లాడే హక్కులేదు: Erra belli

హన్మకొండ: క్లబ్బుల్లో తిరిగే రాహుల్ గాంధీకి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. యుపిఏ పాలనలో దేశంలో 1,58,117 మంది రైతులు చనిపోయారని, తెలంగాణ రాక ముందు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పాలనలో 18వేల మంది రైతులు చనిపోయారని ఆయన గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలుచేసుకున్నారని అన్నారు. ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ఐటీ, చేనేత, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె టి రామారావు సందర్శించనున్న హనుమకొండ నయీం నగర్ లోని సాప్ట్ పాత్ ఐటీ ఆఫీస్ ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తదితరులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి సందర్శించారు.


ఈ సందర్భంగా ఆయన సాప్ట్ పాత్ ఐటీ కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పేరుకే 7 గంటల కరెంటు కాని, వచ్చింది 3 గంటలే. అందులోనూ కోతలే అధికం.కరెంటుతీగలపై బట్టలు ఆరేసుకునే పరిస్థితి.పొలాల్లో పని చేసుకుంటూ పాముకాటుకు, కరెంటు షాకుకు గురై చనిపోయే వాళ్ళని గుర్తు చేశారు.నిజామాబాద్ లో ఎర్రజొన్న రైతులకు కాల్చి చంపించింది కాంగ్రెస్ వాళ్ళు కాదా?ఆంధ్ర, తెలంగాణ లను కలపడం కాంగ్రెస్ తప్పిదం.కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేక వైఖరి వల్ల 1969 తెలంగాణ ఉద్యమంలో 369 మంది అమరులైనారు.మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులైనారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వనందుకే ఈ బలిదానాలు జరిగాయి.


ఉమ్మడి రాష్ట్రంలో ఫర్టిలైజర్ కొరత ఉండేది. క్యూలైన్లలో నిలబడలేక చెప్పులు వరుసలో పెట్టి వారి వంతు వచ్చినపుడు వెళ్లి ఫర్టిలైజర్ ఆతీసుకొని వెళ్ళేవారని అన్నారు.KCR వచ్చిన తర్వాత ఈ 7 ఏళ్లల్లో వ్యవసాయంపై 3లక్షల 87 వేల కోట్లు ఖర్సు చేశామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.24 గంటల కరెంటు, మిషన్ కాకతీయ తో చెరువుల బాగు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా చెరువులను నింపుకున్నమని చెప్పారు. ఉచితంగా రైతులకు సాగు నీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ, అందుబాటులో విత్తనాలు, ఎరువులు...ఎన్నో రైతు అనుకూల విధానాలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతుల అనుకూల విధానాల వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గాయని కేంద్రమే ప్రకటించిందని గుర్తు చేశారు.

Read more