అంబేద్కర్ స్పూర్తితో సీఎం కేసీఆర్ పాలన: మంత్రి ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2022-04-14T20:12:27+05:30 IST
తెలంగాణలో అంబేద్కర్ స్పూర్తితోనే ముఖ్యమంత్రికేసీఆర్ పాలన సాగిస్తున్నారని పంచాయితరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
హన్మకొండ జిల్లా: తెలంగాణలో అంబేద్కర్ స్పూర్తితోనే ముఖ్యమంత్రికేసీఆర్ పాలన సాగిస్తున్నారని పంచాయితరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆత్మబంధువుగా నిలిచారని కొనియాడారు. వరంగల్ - హన్మకొండ లోని అంబేద్కర్ చౌరస్తాలోగల అంబేద్కర్ విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా పూల మాల వేసి, పుష్పాంజలి ఘటించారు.ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అంబేద్కర్ అపర మేధావ అని అన్నారు. అంటరాని తనం రూపు మాపిన సంఘ సంస్కర్త అని అంటూ దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహానుభావుడని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తి తోనే తెలంగాణలో సీఎం పాలన సాగిస్తున్నారని చెప్పారు.
అంబేద్కర్ తర్వాత దేశంలో దళితుల గురించి ఆలోచించిన వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. దళితుల కోసం దళిత బంధు పథకం అమలు చేస్తున్నామని, అంబేద్కర్ కేవలం దళితుల వాడు మాత్రమే కాదు, ఆయన అందరి వాడు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు సాధించడమే సీఎం కెసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. దళిత విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసి, నాన్యమైన విద్యనందిస్తున్నది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.
అంబేద్కర్ విదేశీ విద్యానిధి ద్వారా విదేశాల్లో చదువుకునే వాళ్ళ కోసం ఒక్కొక్కరికి 20 లక్షల సహాయం చేస్తున్న ప్రభుత్వం బడ్జెట్ లో 17 వేల 700 కోట్లు కేటాయించిందన్నారు. అనేక అంశాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలోహన్మకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, మాజీ ఉప ముఖ్య మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వరంగల్ జిల్లా కలెక్టర్, హన్మకొండ ఇంచార్జీ కలెక్టర్ గోపి, కుడా వైస్ చైర్ పర్సన్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.