అభివృద్ధి, సంక్షేమాల‌కు కేసిఆర్ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి వుంది: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-04-06T20:20:41+05:30 IST

అభివృద్ధి, సంక్షేమాల‌కు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

అభివృద్ధి, సంక్షేమాల‌కు కేసిఆర్ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి వుంది: ఎర్రబెల్లి

హన్మకొండజిల్లా: అభివృద్ధి, సంక్షేమాల‌కు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అందులో భాగంగానే ప్ర‌భుత్వ స్థ‌లాల్లో ల‌బ్ధిదారుల‌కు ఇండ్లు నిర్మించి ఇచ్చార‌న్నారు. బుధవారం జిల్లాలోని ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం ఆత్మ‌కూరు మండ‌లం క‌టాక్ష‌పూర్ గ్రామంలో నూత‌నంగా నిర్మించిన 60 డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డితో క‌లిసి ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పేద వారికి సొంతింటి కల నిజమవుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇండ్ల నిర్మాణం చేసి ఇస్తున్నారని అన్నారు. 


పేదలు పైసా ఖర్చు లేకుండా సొంతింటిని అందుకో గలుగుతున్నారని అన్నారు. ఈసందర్భంగా ఇండ్ల‌ను ల‌బ్ధిదారులు స‌ర్వాంగ సుంద‌రంగా అలంకరించుకున్నారు.మంత్రి, ఎమ్మెల్యేను ల‌బ్ధిదారులైన మ‌హిళ‌లు మంగ‌ళ‌హార‌తుల‌తో ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.అభివృద్ధి, సంక్షేమాల‌కు సిఎం కెసిఆర్ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని మంత్రి పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే సొంత స్థ‌లాలు ఉన్న‌వాళ్ళ‌కు కూడా ఇండ్లు ఇచ్చే కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్పారు.తెలంగాణ బిడ్డ‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌న్న‌దే సీఎం కేసిఆర్ ల‌క్ష్య‌మ‌న్నారు.ఈ కార్య‌క్ర‌మంలో జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ గండ్ర జ్యోతి, హ‌న్మ‌కొండ జిల్లా క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ల‌బ్ధిదారులు, గ్రామ ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-06T20:20:41+05:30 IST