యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందే: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-04-04T21:12:19+05:30 IST

తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పడం సిగ్గుచేటని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందే: ఎర్రబెల్లి

జనగామజిల్లా: తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పడం సిగ్గుచేటని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ, టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల పిలుపు మేరకు చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  పాలకుర్తి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. వరసగా నియోకవర్గ0లోని రాయపర్తి, తొర్రూరు, పెద్ద వంగర, కొడకండ్ల, దేవరుప్పుల మండల కేంద్రాల్లో రైతులు, ప్రజల భాగస్వామ్యంతో పార్టీ ప్రజా ప్రతినిధులు, శ్రేణులు నిర్వహించిన ధర్నా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.


ఎడ్ల బండ్లు ఎక్కి, తలపాగా చుట్టి, చర్లకోల చేతబట్టి, రైతాంగం వెంట తరలి రాగా, మంత్రి రైతులా రైతులతో కలిసి పోయారు.అలాగే భారీ ఎత్తున జరిగిన ఈ ధర్నా కార్యక్రమాల్లో మంత్రి కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, నినాదాలు చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-04-04T21:12:19+05:30 IST