ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలు శాంతి, సామరస్యానికి వేదికలు కావాలి

ABN , First Publish Date - 2022-04-03T20:29:47+05:30 IST

రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సొదరులు నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలు శాంతి, సామరస్యానికి వేదికలు కావాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలు శాంతి, సామరస్యానికి వేదికలు కావాలి

హైదరాబాద్: రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సొదరులు నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలు శాంతి, సామరస్యానికి వేదికలు కావాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసిఆర్ తరచూ చెప్పే, తెలంగాణకే తల మానికమైన "గంగజమునా తెహజీబ్ " మరింతగా పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిమ్ సోదరులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక ప్రభుత్వమే ప్రజల పండుగలు నిర్వహించే గొప్ప సంస్కృతిని కేసిఆర్ మొదలు పెట్టారన్నారు.ముస్లింల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు.


 మైనార్టీల సంక్షేమానికి 2008 నుండి 2014 మద్యకాలంలో 812 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, గత ఏడేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం 5,900 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం రంజాన్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ ప్రతి ఏటా రాష్ట్రంలోని దాదాపు నాలుగున్నర లక్షల మంది ముస్లింలకు దుస్తులను, రంజాన్ కానుకలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.పేదింటి ముస్లిం మహిళల వివాహం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష 116 రూపాయల సహాయం షాదీ ముబార‌క్ పథకం ద్వారా అందజేస్తున్నదని మంత్రి చెప్పారు.హైదరాబాద్ లోని అంతర్జాతీయ ప్రమాణాలతో ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి కోకాపేటలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి 40 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.


రాష్ట్రంలోని మసీదులలో ప్రార్థనలు చేసే 10 వేల మంది ఇమామ్ లకు ప్రతినెలా 5 వేల రూపాయల భృతి అందించబడుతున్నదని అన్నారు.ఈ పథకం కింద ఇప్పటి వరకు ఇమామ్, మౌజన్ లకు రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయల భృతిగా చెల్లించిందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.తెలంగాణ వర్ఫ్ బోర్డు సంస్థలో నిర్మాణాలు, మరమ్మతుల కోసం 53 కోట్ల రూపాయల గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం అందించిందని ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేయడమే కాకుండా ఉర్దూ అకాడమీ నిర్వహణకు 40 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఆయన వివరించారు. 

Updated Date - 2022-04-03T20:29:47+05:30 IST