నంది ఎల్లయ్య మృతి కలిచివేసింది- ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-08-09T21:01:10+05:30 IST
రికార్డుస్థాయిలో ఆరు సార్లుమెంట్కు, రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి తనను తీవ్రంగా కలిచి వేసిందని పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్రావు పేర్కొన్నారు.
హైదరాబాద్: రికార్డుస్థాయిలో ఆరు సార్లుమెంట్కు, రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి తనను తీవ్రంగా కలిచి వేసిందని పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్రావు పేర్కొన్నారు. తెలంగాణలోని బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. ఎల్లయ్యతో తాను కూడా ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయడం ద్వారా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా ఎల్లయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.