జర్నలిస్టులకు అండగా తెలంగాణ సర్కార్- ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-05-29T21:38:27+05:30 IST
జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు
హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. డెస్క్, ఫోటో, వీడియో జర్నలిస్టులనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తున్న ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు. అలాగే జర్నలిస్టులకు మొదటిసారి ప్రత్యేక నిధిని ఏర్పాటు ఆదుకుంటున్న ప్రభుత్వం కూడా తెలంగాణనే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమపట్ల ప్రత్యేక దృష్టిపెట్టారని అన్నారు. ఇటీవల మృతి చెందిన ఫోటో జర్నలిస్టు రాజమౌళి కుటుంబాన్ని మంత్రి ఎర్రబెల్లి పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన రాజమౌలితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనం కోసం పాటుపడే జర్నలిస్టులు వారి వ్యక్గిగత జీవితం, సొంత కుటుంబాల గురించి కూడా ఆలోచించాలన్నారు. పిల్లల భవిష్యత్తు గురించి కొంత సమయం కేటాయించాలని సూచించారు. ప్రభుత్వం జర్నలిస్టుల కోసం మరే రాష్ట్రంలో లేని విధంగా ఆలోచిస్తున్నదని అన్నారు.