మంత్రి ఎర్రబెల్లి ని కలిసిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు

ABN , First Publish Date - 2021-08-21T22:39:08+05:30 IST

అనాథలకు హక్కులు కల్పించడానికి సీఎం కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులు,తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను నియమించారు

మంత్రి ఎర్రబెల్లి ని కలిసిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు

హైదరాబాద్: అనాథలకు హక్కులు కల్పించడానికి సీఎం కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా,తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను నియమించారు.ఈ నేపధ్యంలో గాదె ఇన్నయ్య నేతృత్వంలో  ఫోర్స్,ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలిసి అనాథల కొరకు ప్రత్యేక చట్టం ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు.అలాగే కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో తమ సమస్యలను వివరించాలని కోరారు. వారి సమస్యలను సామరస్యంగా విన్నమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సానుకూలంగా స్పందించి సీఎం కెసిఆర్ గారితో చర్చిస్తానని తెలిపారు.

Updated Date - 2021-08-21T22:39:08+05:30 IST