ఈ నెల 20వ తేదీ నుంచి ‘సారస్ ఫెయిర్-2021’
ABN , First Publish Date - 2021-12-16T23:22:19+05:30 IST
పేదరిక నిర్మూలనా సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు లో ఈ నెల 20వ తేదీ నుంచి జవనరి 3వ తేదీ వరకు సారస్ ఫెయిర్-2021 ను నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: పేదరిక నిర్మూలనా సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు లో ఈ నెల 20వ తేదీ నుంచి జవనరి 3వ తేదీ వరకు సారస్ ఫెయిర్-2021 ను నిర్వహిస్తున్నారు. ఈ ఫెయిర్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని గురువారం హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, సెర్ప్ సిఈఓ సందీప్ కుమార్ సుల్తానియా ఆహ్వానించారు.
దేశ వ్యాప్తంగా 20 ఏళ్ళుగా నిర్వహిస్తున్న ఈ ఫెయిర్ ల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి, మార్కెటింగ్ సదుపాయాలను కల్పించడం జరిగిందని సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 300 మంది చేనేత, హస్తకళల, బట్టల, తోలు వస్తువుల ఉత్పత్తులు, సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు ఈ ఫెయిర్ లో ప్రదర్శించడంతోపాటు, అమ్మకానికి ఉంటాయని ఆయన తెలిపారు.