మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వైస్‌ ఎంపీపీ ఆనంద్‌

ABN , First Publish Date - 2020-09-30T06:48:24+05:30 IST

కడ్తాల మండల అభివృద్ధికి సహకారం అందించాలని వైస్‌ ఎంపీపీ బావండ్లపల్లి ఆనంద్‌ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కోరారు

మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వైస్‌ ఎంపీపీ ఆనంద్‌

కడ్తాల్‌ : కడ్తాల మండల అభివృద్ధికి సహకారం అందించాలని వైస్‌ ఎంపీపీ బావండ్లపల్లి ఆనంద్‌ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కోరారు. మంగళవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి నివాసంలో ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. నూతనంగా ఏర్పడ్డ కడ్తాల మండల అభివృద్ధి, మండల పరిషత్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రిని  కోరగా సానుకూలంగా స్పందించినట్లు ఆనంద్‌ తెలిపారు. అదే విధంగా గ్రామాల్లో రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం గురించి విన్నవించినట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2020-09-30T06:48:24+05:30 IST